News April 1, 2025

ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఖైరిగూడ ఓసీపీ

image

బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఆసీఫ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందని ఇన్‌ఛార్జ్ జీఎం నరేందర్ తెలిపారు. సింగరేణి సంస్థ ఏరియాకు 4.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 5.43 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఉత్పత్తి శాతం 116గా నమోదైనట్లు చెప్పారు. అధికారులు, కార్మికులు సమష్టి కృషితో రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలను చేరుకుంటామన్నారు.

Similar News

News November 18, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జోరు

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కల నెరవేరుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనులు ప్రారంభమైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.

News November 18, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జోరు

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కల నెరవేరుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనులు ప్రారంభమైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.

News November 18, 2025

శివతత్వంతోనే లోకానికి రక్ష: సామవేదం షణ్ముఖ శర్మ

image

శివతత్వంతోనే లోకానికి రక్షణ లభిస్తుందని ప్రవచనకర్త, వేద పండితులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. వేములవాడ క్షేత్రంలో ఏర్పాటు చేసిన శివ కారుణ్యం పురాణంపై ఆయన సోమవారం రాత్రి ప్రవచనం వినిపించారు. శివుడి ఆరాధనతో సమస్త మానవాళికి మేలు జరుగుతుందని, ప్రజలంతా దేవుడి ఆరాధనతో పాటు పరోపకారంతో ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈఓ రమాదేవి, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.