News February 1, 2025
ఉదండాపూర్ రిజర్వాయర్లో పడి చిన్నారులు మృతి

ఉదండాపూర్ రిజర్వాయర్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2025
రాజాపూర్: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్ స్టేషన్ మాస్టర్ వెంకట్రావు వివరాల ప్రకారం.. మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో రైలు ఢీకొని ఓ మహిళ (30) మృతి చెందింది. మృతదేహాన్ని MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిస్తే 98480 90426 తెలపాలన్నారు.
News February 16, 2025
MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన MBNR పట్టణంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని తన ఇంట్లోకి తీసుకొని అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. చిన్నారి తల్లి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 15, 2025
MBNR: మినీ మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి రాక

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఖరారైంది. పోలేపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.