News September 27, 2024
ఉదయం 8 గంటలకు సిరిమాను చెట్టుకు పూజలు

డెంకాడ మండలం పెదతాడివాడలో గుర్తించిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చింతచెట్టు నగరానికి శనివారం తీసుకురానున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును కొట్టే కార్యక్రమం చేపడతారు. అనంతరం భారీ ఊరేగింపుతో ఆ చెట్లను పలు కూడళ్ళ మీదుగా పూజారి స్వగృహం ఉన్న హుకుంపేట తరలిస్తారు. అక్కడ నిపుణులైన వడ్రంగులు ఈ చెట్టును సిరిమానుగా మలిచే పని మొదలు పెడతారు.
Similar News
News November 15, 2025
ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News November 15, 2025
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు: మంత్రి కొండపల్లి

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్తో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆరంభించిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన రావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్తో పాటు వివిధ రంగాల వారీగా నిపుణులు సమ్మిట్లో పాల్గొన్నారన్నారు.
News November 14, 2025
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.


