News April 3, 2025

ఉదయం 8 తర్వాత హెవీ వెహికల్స్‌కు ప్రవేశం లేదు: ట్రాఫిక్ డీఎస్పీ

image

ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ గుంటూరులోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో నగరంలోని హెవీ వెహికల్స్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాత్రి 10:00 నుంచి ఉదయం 8 గంటల లోపు మాత్రమే హెవీ వెహికల్స్ నగరంలోకి ప్రవేశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సింగయ్య పాల్గొన్నారు.

Similar News

News April 11, 2025

గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లిలో కేసు నమోదు

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ మేరకు గురువారం తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.

News April 10, 2025

జూలకల్లులో వైసీపీ నేతపై దాడి

image

ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని జూలకల్లులో వైసీపీ నేత పాశం చిన్న అంజిరెడ్డిపై గురువారం కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆయన్ని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2025

GNT: సోషల్ మీడియా దుర్వినియోగానికి గట్టి హెచ్చరిక 

image

చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను TDP ఆయనను తక్షణమే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా పార్టీ నైతిక ప్రమాణాలను ప్రదర్శించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఆచరణా నియమాలను ఉల్లంఘించే వారికి హెచ్చరికగా నిలిచింది. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. CM చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అంటున్నారు. 

error: Content is protected !!