News July 7, 2024
ఉదయగిరి: జగన్పై అటవీ శాఖకు తగ్గని ప్రేమ !

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలల గడుస్తున్న అటవీశాఖ అధికారులలో మాత్రం జగనన్న ప్రభుత్వం మీద అమితమైన ప్రేమ అలాగే ఉంది. ఉదయగిరి మండలం బండగానిపల్లె కూడలి వద్ద అటవీశాఖ ఉదయగిరి రేంజ్ అధికారులు ఏర్పాటు చేసిన ‘అడవికి నిప్పు మనుగడకు ముప్పు’ అనే ఫ్లెక్సీలు జగనన్న ఫోటోతో దర్శనమివ్వడంతో అధికారుల తీరును పలువురు విమర్శిస్తున్నారు.
Similar News
News November 14, 2025
గుడ్లూరు: హైవేపై విషాదం.. దంపతులు మృతి

గుడ్లూరు (M)మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో NTR(D) జి కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.
News November 13, 2025
నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.
News November 13, 2025
జగన్తో మాజీ మంత్రి అనిల్ భేటీ

తాడేపల్లిలో YCP అధినేత జగన్ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.


