News October 20, 2024

ఉదయగిరి దుర్గం కొండపై పర్యాటకుల సందడి

image

ఉదయగిరి దుర్గం కొండపై ఆదివారం ఉదయం నుంచి పర్యాటకుల సందడి ప్రారంభమైంది. ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉదయగిరి కొండపై నుంచి జలపాతం కిందకు దూకుతూ ఉండడంతో పాటు కొండ కింద సెలయేర్లు ప్రవహిస్తూ ఉండడంతో ఉదయగిరి వాసులే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి వాటిని చూసేందుకు వెళ్తున్నారు. కొండపై నుంచి ప్రవహిస్తున్న సెలయేర్లలో ఈత కొడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు.

Similar News

News November 27, 2025

నెల్లూరుకు అన్యాయం.. ‘పెద్దారెడ్లు’ఏం చేస్తున్నారో.!

image

జిల్లా పునర్విభజనతో సింహపురి వాసులు మనోవేదనకు గురవుతున్నారు. గూడూరు అయినా జిల్లాలో కలుస్తుందనే ఆశలు నీరుగారాయి. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్లో కలిపి తిరుపతిలో చేర్చారు. ఇంత జరుగుతున్నా ‘<<18401742>>నెల్లూరు పెద్దారెడ్లు<<>>’గా చెప్పుకొనే నేతలు ఏం చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. దీనిపై వారు ఎందుకు ప్రశ్నించడం లేదు.? రాజకీయ భవిష్యత్తు కోసమేనా? అని ప్రజలు చర్చించుకుంటున్నారట.

News November 27, 2025

నెల్లూరు జిల్లాకు కన్నీటిని మిగిల్చిన పునర్విభజన

image

పెంచలకోన, శ్రీహరికోట, ఫ్లెమింగో ఫెస్టివల్..జిల్లా శిగలో మణిహారాలు. వీటితో నిత్యం <<18390784>>జిల్లా<<>> పర్యాటకులతో సందడిగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత కథ మారింది. <<18390350>>3 నియోజకవర్గాలను<<>> తిరుపతిలో కలపడంతో చెంగాలమ్మ టెంపుల్, శ్రీసిటి, వెంకటగిరి జాతర, దుగ్గరాజపట్నం పోర్ట్ వంటి ప్రఖ్యాత ప్రదేశాలు వెళ్లిపోయాయని రొట్టెలపండుగ తప్ప <<18391147>>ఇంకేమీ<<>> మిగిలిదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News November 27, 2025

నెల్లూరు: ఫ్రీగా స్కూటీలు.. 30న లాస్ట్.!

image

దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. 10పాసై, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఇందుకు అర్హులు. జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది అప్లై చేసుకున్నట్లు ఏడీ ఆయుబ్ తెలిపారు. అర్హులు APDASCELC.AP.GOVలో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులు కోరారు.