News April 2, 2024

ఉదయగిరి: పింఛన్ కోసం పడిగాపులు కాసి వృద్ధుడు మృతి

image

ఉదయగిరి మండల పరిధిలోని కొండయ్యపాలెం పంచాయతీ వీరారెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన స్వర్ణ లక్ష్మయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటింటికి తెచ్చి పెన్షన్లు అందజేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లు వ్యవస్థను పక్కన పెట్టింది. దీంతో పెన్షన్ మీదే ఆధారపడే ఈ వృద్ధుడు ఉండబట్టలేక కొండాయపాలెం సచివాలయం వెళ్లి విచారించి తిరిగి ఇంటికి వచ్చే లోగా ప్రాణం వదిలారు.

Similar News

News October 26, 2025

కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

కందుకూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కోవూరు రోడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం పురుగు మందు తాగిన ఇద్దరిని కందుకూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఒకరు మరణించారని తెలిసింది. చికిత్స పొందుతూ మరొకరు కూడా మరణించారని సమాచారం. వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.

News October 26, 2025

నెల్లూరు: అంతా ఉరుపే.. తడిస్తే మాకేంటి..!

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వెనుక ఉండే పాత భవనంలో సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, బ్లీచింగ్ తదితర వస్తువులు భద్రపరుస్తారు. అయితే ఆ భవనం పాతదై పడిపోయే స్థితిలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం ఆ భవనం ఉరిసింది. దీంతో అక్కడ ఉన్న సామగ్రి తడిచిపోయింది. ఎంతో విలువైన వాటిని భద్రపరిచేందుకు అక్కడ STORE ROOM సైతం లేకపోవడం గమనర్హం. గతంలో ఎన్నో సార్లు ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు.

News October 26, 2025

నెల్లూరులో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్

image

ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ వ్యవహారం నెల్లూరులో కలకలం రేపుతుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మిపురంలో ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన లోకేష్, అనంతసాగర్ మండలం దేవరాయపల్లికి చెందిన రాకేష్ ఇద్దరు కలిసి హాస్టల్లో ఉంటున్నారు. అయితే వారు మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.