News February 6, 2025
ఉదయగిరి: సీనియర్ అధ్యాపకుడు గుండెపోటుతో మృతి
ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పలు కళాశాలల్లో పనిచేసిన సీనియర్ అధ్యాపకుడు బి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. గత రాత్రి దాసరిపల్లిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి భోజనం తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News February 6, 2025
కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..
కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.
News February 6, 2025
కావలి DSPని ఆశ్రయించిన ప్రేమ జంట
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన గుండె మడుగుల బెనర్జీ, ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన కీర్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు కావలిలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నుంచి ప్రాణహాని ఉందని గ్రహించి కావలి డీఎస్పీ శ్రీధర్ను ఆశ్రయించారు.
News February 6, 2025
నెల్లూరు: 38ఏళ్ల తర్వాత జాతర.. ఒకరు మృతి
38 ఏళ్ల కిందట ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు(మం), జీలపాటూరులో గ్రామదేవత పోలేరమ్మకు జాతర నిర్వహించారు. ఆ రోజు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి గొంజి మొక్కలు తీసుకుని స్వర్ణముఖినది దాటుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి అమ్మవారి జాతర చేయలేదు. మళ్లీ 38ఏళ్ల తర్వాత ఈనెల 5న జాతర చేపట్టారు. అమ్మవారి ఘటం మోస్తున్న APSP హెడ్ కానిస్టేబుల్ నరసయ్య ఇంటి దగ్గరకు రాగా..బాత్రూంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.