News April 8, 2025
ఉద్యాన పంటలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని రైతులకు సూచించారు. మంగళవారం వీరబల్లి మండలంలోని మాదిరెడ్డిపల్లిలో మామిడితోటలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. అనంతరం మామిడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో ఇంటి పోరు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది.పలు గ్రామాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిపైనే సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. పెద్దఎత్తున నామినేషన్లు రావడంతో కొందరు విత్ డ్రా చేసుకున్నప్పటికీ మరికొందరు నేతలు విరమించేందుకు యత్నాలు చేసినా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు రంగంలోకి దిగారు.
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<


