News March 7, 2025

ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇస్తాం: భరత్

image

AKP జిల్లాలో రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తునన్నట్లు ఇండ్రస్టీయల్ మినిస్టర్ భరత్ ప్రకటించారు. సభలో గురువారం కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడారు. రెండు దశల్లో ఆర్సిలర్ మిట్టల్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.

Similar News

News December 6, 2025

నిర్మల్: తొలి విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్స్ జరగనున్న ఆరు మండలాల్లో మొత్తం 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మామడ 5, ఖానాపూర్ 5, పెంబి 4, దస్తురాబాద్, లక్ష్మణచందా మండలాల్లో 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడెంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.

News December 6, 2025

డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

image

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం

News December 6, 2025

GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

image

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.