News March 7, 2025
ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇస్తాం: భరత్

AKP జిల్లాలో రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తునన్నట్లు ఇండ్రస్టీయల్ మినిస్టర్ భరత్ ప్రకటించారు. సభలో గురువారం కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడారు. రెండు దశల్లో ఆర్సిలర్ మిట్టల్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.
Similar News
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
పల్లె టు కాశ్మీర్.. సరిహద్దులో కొండంరాజుపల్లి బిడ్డ

సిద్దిపేట జిల్లా కొండంరాజపల్లి గ్రామానికి బండి లక్ష్మి- తిరుపతి దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్ పథకంలో దేశసేవకు అంకితమయ్యాడు. బెంగళూరులో ఆరు నెలల కఠోర శిక్షణను పూర్తి చేసిన శ్రీనివాస్ కల ఉద్యోగ పట్టాను అందుకున్నాడు. అతని పట్టుదలతో కాశ్మీర్లో దేశ సేవలకు వెళ్తున్నాడు. ఈ విజయం పట్ల స్వగ్రామంలో ఆనందం నెలకొంది.


