News March 7, 2025

ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇస్తాం: భరత్

image

AKP జిల్లాలో రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తునన్నట్లు ఇండ్రస్టీయల్ మినిస్టర్ భరత్ ప్రకటించారు. సభలో గురువారం కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడారు. రెండు దశల్లో ఆర్సిలర్ మిట్టల్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.

Similar News

News March 16, 2025

ఆదిలాబాద్‌లో AIRPORT.. AI PHOTO

image

ADBలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 16, 2025

ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

image

ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2025

విజయనగరం: 119 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

image

విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO యు. మాణిక్యం నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం. 
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 119 
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 23,765 
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు: 7 
➤ సిట్టింగ్ స్క్వాడ్‌లు: 2 
➤ ఇన్విజిలేటర్లు:2,248 
☞ అందరికీ Way2News తరఫున All THE Best

error: Content is protected !!