News June 12, 2024

ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం సానుకూలం: టీఎన్జీవో

image

ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్యోగుల సమస్యలు లేవనెత్తగా పైవిధంగా స్పందించారని తెలిపారు.

Similar News

News November 6, 2025

మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.

News November 6, 2025

నిజాంపేట: ALERT.. లింక్ క్లిక్ చేస్తే రూ.45 వేలు మాయం

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన మౌనిక ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలు పోయినట్లు ఎస్ఐ తెలిపారు. సెల్ ఫోన్‌లో సంబంధం లేని లింకులను, బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

News November 5, 2025

మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

image

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.