News December 27, 2024
ఉధారంగా రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్ ప్రశాంతి
జిల్లాలో కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం జరిగింది. డిసెంబరు 30న నాబార్డు ఆధ్వర్యంలో రొయ్యల రైతుల ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. త్రైమాసిక ప్రణాళిక, పేదల ఆర్థిక అభ్యున్నతి, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలపై దృష్టి సాధించాలన్నారు.
Similar News
News January 22, 2025
రాజమండ్రి: 22 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు
జనవరి 22 నుంచి 30 వరకు జరిగే JEE మెయిన్స్ పరీక్షల నిర్వహణను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జె ఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణా పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజమండ్రి లూధరగిరి రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్లో పరీక్షలు జరుగుతాయన్నారు.
News January 21, 2025
అమలాపురం: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట అమలాపురం రూరల్ పోలీసులను మంగళవారం ఆశ్రయించింది. అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామానికి చెందిన మధుర వెంకటేష్, కాకినాడ పట్టణానికి చెందిన సబ్బతి ప్రమీలా దేవి ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న అనంతరం ఇరు కుటుంబాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమలాపురం రూరల్ పోలీసులను కోరారు.
News January 21, 2025
కిర్లంపూడి: రహదారి ప్రమాదంలో స్నేహితుల మృతి
కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్ర(23), ముక్త దుర్గ బాబు(24)లు బైక్పై వెళ్తుండగా విజయవాడ హైవేపై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.