News August 14, 2024

ఉనికిని కాపాడుకునేందుకు TDP నేతలపై దాడులు: మంత్రి బీసీ

image

కర్నూలు (D) పత్తికొండ (మం) హోసూరులో TDP నేత శ్రీను హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. YCP ఉనికిని కాపాడుకునేందుకు జగన్&కో తమ నేతలు, కార్యకర్తలపై హత్యలు, బెదిరింపులతో దాడులకు పాల్పడుతుందని బీసీ విమర్శించారు. హత్య చేసిన వారిని, వారి వెనుకున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి బీసీ హామీచ్చారు.

Similar News

News February 26, 2026

కర్నూలు జిల్లాలో 293 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 293 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐవో లాలప్ప తెలిపారు. మొత్తం 21,428 మంది విద్యార్థులకు గానూ 21,135 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షల పట్ల సందేహాలు ఉంటే ఆర్ఐవో కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

News February 25, 2026

డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయండి: ఎస్పీ

image

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెంచి, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేర నియంత్రణకు మరింత పటిష్ఠంగా పనిచేయాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్, గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 25, 2026

ఇంటర్ పరీక్షలకు 852 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.