News January 30, 2025

ఉపకార వేతనాల దరఖాస్తు గడవు పొడిగింపు

image

జోగులాంబ జిల్లాలోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థుల ఫ్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల వివరాలను telangana epass.gov.in లో ఆన్లైన్ చేయాలని సూచించారు.  

Similar News

News October 24, 2025

NRPT: విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు: కలెక్టర్

image

నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడంపై నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 14న జిల్లా స్థాయిలో స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News October 24, 2025

మంథని: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా NOV 5న అరుణాచలగిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడపనున్నట్లు డిపో మేనేజర్ వి.శ్రవణ్ కుమార్ తెలిపారు. NOV 3 సాయంత్రం మంథని నుంచి బయలుదేరి, KNR, HYD, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల తర్వాత 4న రాత్రి బస్ అరుణాచలం చేరుతుంది. 5న తిరుగు ప్రయాణం. 6న అలంపూర్ జోగులాంబ దర్శనమనంతరం మంథని చేరుకుంటుంది. టికెట్ పెద్దలకు రూ.5040, పిల్లలకు రూ.3790. 9959225923

News October 24, 2025

కోరుట్లలో గంజాయి మొక్కలు.. ముగ్గురి రిమాండ్

image

కోరుట్ల హాజీపూర్‌లో తుమ్మ చెట్ల మధ్య గంజాయి మొక్కలను పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బోలా శంకర్(27), కైలాస్ కుమార్(29), సన్నీ(26) అనే ముగ్గురు వ్యక్తులను పట్టుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ బాబు, SI చిరంజీవి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 90,000ల విలువగల 9 గంజాయి మొక్కలను, 2 మొబైల్ ఫోన్లను వీఆర్ఏ, అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపామని పేర్కొన్నారు.