News March 10, 2025

ఉపమాకలో తిరుపతి శ్రీవారి లడ్డూలు

image

నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా తిరుపతి శ్రీవారి లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నారు. సోమవారం ఆలయ వద్ద లడ్డు విక్రయాలను మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా ఏటా భక్తుల కోసం టీటీడీ ఆలయానికి లడ్డూలను పంపిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 17, 2025

నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

image

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.

News March 17, 2025

మార్చి17: చరిత్రలో ఈరోజు

image

*1892 : తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం.
*1896 : నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత మహిళ కల్పనా చావ్లా జననం
*1990: బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం

News March 17, 2025

కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

image

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.

error: Content is protected !!