News March 2, 2025

ఉపరాష్ట్రపతిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

image

హైదరాబాద్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వాగతం పలికారు. శాలువా కప్పి అభివాదం చేశారు. కాగా కందిలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్‌ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News February 23, 2026

NZB: అందరి సహకారంతో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

image

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ సన్మానించారు.

News February 23, 2026

MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

image

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.

News February 23, 2026

NZB: లైసెన్స్‌‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

image

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.