News March 2, 2025
ఉపరాష్ట్రపతిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్కు చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వాగతం పలికారు. శాలువా కప్పి అభివాదం చేశారు. కాగా కందిలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 1, 2025
ADB: ‘డబ్బు పంపండి.. లేదంటే న్యూడ్ ఫొటోలు పంపుతాం’

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోథ్కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడికి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే తన అకౌంట్కు డబ్బులు పంపాలని లేదంటే బాధితుడి న్యూడ్ ఫొటోలు ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు పంపుతాం అని హిందీలో బెదిరించారు. ఫోన్ నంబర్ పాకిస్థాన్కు చెందినదిగా గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 1, 2025
పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.
News December 1, 2025
42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.


