News April 12, 2025

‘ఉపాధిహామీ పనులకు పెద్దఎత్తున మొబిలైజ్ చేయాలి’

image

ఉపాధిహామీ పథకం పనులకు పెద్దఎత్తున లేబర్‌ను మొబిలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్షలో మాట్లాడుతూ.. మన జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో ఆశించిన ప్రగతి రావడం లేదని అన్నారు. మన జిల్లాలో కూలిరేటు సరాసరి రూ.211 ఉన్నట్లు తెలిపారు. ప్రతి వారం ప్రగతి రావాలని, ఉపాధిహామీ పథకం పనులు వినియోగానికి ఈ రెండు నెలలు చాలా కీలకమని తెలిపారు.

Similar News

News April 22, 2025

ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

image

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News April 22, 2025

ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

image

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News April 22, 2025

గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి

image

క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి అండ‌గా నిలిచారు. సదాశివపేటకు చెందిన ఆమని ఇంటికి వెళ్లిన ఆయన బాధితురాలిని పరామర్శించారు. చికిత్సకు రూ.7 లక్షల అప్పులు చేశానని.. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమని విలపించింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని వాపోయింది. బాధితురాలి గాథ విని జగ్గారెడ్డి తక్షణమే రూ.10 లక్షలు అందించారు.

error: Content is protected !!