News January 6, 2025
ఉపాధి పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లాలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు సోమవారం ఒంగోలులో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు రూ.300 వేతనం పెంచుటానికి ఏఏ ప్రణాళికలు ఉన్నాయో క్షేత్ర సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో అమలుపరుస్తున్న పల్లె పండుగ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
Similar News
News January 7, 2026
మార్కాపురం: హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఇతనే.!

మార్కాపురం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.
News January 7, 2026
కనిగిరి హత్య కేసులో మరో ట్విస్ట్.!

వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లిలో మహిళను చంపి, ఆపై AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం క్లూస్టీం రంగంలోకి దిగింది. సీనావలి, నాగజ్యోతి మృతదేహాలకు కనిగిరి ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. జ్యోతి మృతదేహాన్ని కట్టకిందపల్లికి తరలించేందుకు యత్నించగా మృతురాలి బందువులు న్యాయం చేయాలని పోలీసులను నిలదీశారు. వీరిరువురి మృతిపై <<18773256>>మూడవ వ్యక్తి ప్రమేయం<<>> ఉందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు.
News January 7, 2026
ప్రకాశం: మోసంచేసి రన్నింగ్ బస్ దూకి మృతి

టంగుటూరుకు చెందిన మురళి చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు RTC బస్సులో వస్తున్నాడు. జాగర్లమూడివారిపాలెంకి చెందిన గోపీనాథ్(24) అదే బస్సులో మేదరమెట్ల వద్ద ఎక్కాడు. తనకు రూ.200 ఫోన్పే చేయాలని మురళిని అడిగి కొడుతుండగా పాస్వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు గోపీ. మరోసారి మురళిని ఫోన్ అడిగి రూ.90వేలు ట్రాన్ఫర్ చేసుకున్నాడు. మురళి గమనించి అడగగా గోపీ రన్నింగ్ బస్ నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కాగా మంగళవారం చనిపోయాడు.


