News September 12, 2024
ఉపాధి హామీలో 25వ స్థానం: కర్నూలు కలెక్టర్

ఉపాధి హామీ పనుల కల్పనలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అసహనం వ్యక్తం చేశారు. తుగ్గలి మండలంలో గతవారం జీరో శాతం నమోదుపై సంబంధిత అధికారులందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఉపాధి హామీ, హౌసింగ్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వెల్దుర్తి, కృష్ణగిరి, కర్నూలు, ఓర్వకల్ మండలాల్లో పనులు కల్పించడంలో వెనుకబడి ఉన్నారని అన్నారు.
Similar News
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
మగపిల్లలు పుట్టలేదని వ్యక్తి సూసైడ్

ఆదోని పరిధిలోని మదిరే వాసి గంపల సోమ(31) రైలు కిందపడి మంగళవారం మృతిచెందాడు. మగ పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్వీ ఆర్ఎస్ 501/18 సమీపంలో మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 15, 2025
‘మీ ప్రతి పైసా సురక్షితం’

ప్రతీ వ్యక్తికి జీవిత బీమా అందించాల్సిన బాధ్యత LICపై ఉందని, అది ప్రతీ LIC ఏజెంట్ బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాలని కడప డివిజన్ సీనియర్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మిగనూరు LIC బ్రాంచ్ కార్యాలయంలో ఏజెంట్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. LICలో పెట్టే ప్రతి పైసా సురక్షితమైనదన్నారు.