News April 4, 2025

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడగాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాలలో కొనసాగుతున్న అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులతో కాసేపు కలెక్టర్ ముచ్చటించారు. రోజు న్యూస్ పేపర్ చదివి వార్తలు తెలుసుకోవాలని అన్నారు. పాఠశాలలో మెనూ పాటించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 12, 2025

పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

image

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News November 12, 2025

కరీంనగర్: ఏసీబీ రైడ్‌లో నమోదైన కేసుల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2025లో ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. రెవెన్యూ-8, పంచాయితీ రాజ్-6, రిజిస్ట్రేషన్-3, ఖజానా-3, మున్సిపల్-3, అగ్రికల్చర్-3, ఔషధ విభాగం-3, ఆర్టీఏ-3, పోలీస్-1 రెడ్ హ్యాండెడ్‌గో పట్టుకున్నామన్నారు. 30 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News November 12, 2025

స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.