News August 1, 2024

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కాంప్లెక్స్ హైస్కూల్ హెచ్ఎంలతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో చదవడం, రాయడంపై ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలో బేసిక్ టెస్టులు నిర్వహించాలన్నారు.

Similar News

News November 30, 2025

కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.

News November 30, 2025

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారు చమనపల్లి రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట రెండు బైక్‌లు ఢీకొనగా అటుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు చామనపల్లి, సాంబయ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 30, 2025

KNR: ‘ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోండి’

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారిణి కే.సంగీత తెలిపారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా e-passలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలని ఆమె సూచించారు.