News March 4, 2025
ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటంవల్లే ఓడిపోయాను: రఘువర్మ

ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటం వల్లే ఓడిపోయానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అన్నారు. ఆరేళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానన్నారు. గత ఎన్నికల్లో యూటీఎఫ్తో కలిసి పోటీ చేసి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి విడివిడిగా పోటీ చేయడం కూడా ఓటమికి ఒక కారణం అన్నారు. ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉందని అది తనమీద కాదన్నారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.
News December 9, 2025
సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
News December 9, 2025
గద్వాల్: నేటితో ముగియనున్న ప్రచారం

తొలి విడుత పంచాయతీ సమరం రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో ధరూర్, గద్వాల్, గట్టు, కేటిదొడ్డి మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 106 గ్రామ పంచాయతీ, 974 వార్డు మెంబర్లకు గాను 14 సర్పంచ్, 120 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోరు జరగనుంది. నేటితో ప్రచారానికి END కార్డు పడనుంది.


