News July 26, 2024

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి

image

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోలేక పోతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు సర్వీస్ రూల్స్ పట్టించుకోలేదని వెల్లడించారు.

Similar News

News November 24, 2025

MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 24, 2025

MBNR: 110 పోగొట్టుకున్న ఫోన్లు స్వాధీనం

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొత్తం 110 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ (Central Equipment Identity Register) సహకారంతో ట్రేస్ చేసి, సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో బాధితులకు అందజేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News November 24, 2025

మిడ్జిల్: రోడ్డుపై భారీ గుంత.. సూచికగా చెట్ల కొమ్ములు

image

మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామ రహదారిపై భారీగా గుంత పడింది. ఇటీవల ఈ రోడ్డు ఘోర యాక్సిడెంట్ జరిగి ఒక మహిళా చనిపోయింది. ఇది గమనించిన మల్లాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల మధు పక్కనే ఉన్న చెట్లు కొమ్ములు గుర్తుగా పెట్టారు. చిన్న రోడ్లలో ప్రమాదాలకు ఈ గుంతలే అధికంగా కారణమవుతున్నాయని అన్నారు. మీ పరిసరాలలో ఎక్కడైనా రోడ్లపై ఇలాంటివి కనిపిస్తే ఏదైనా సూచికగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.