News February 23, 2025

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి

image

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్,మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

image

మహబూబ్ నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.

News November 13, 2025

గద్వాల్ కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

image

గద్వాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె.సంధ్యా కిరణ్మయి కలెక్టర్ సంతోష్‌ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయనను కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ జిల్లాను అన్ని పారామీటర్స్‌లో ముందు ఉంచాలని, జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

image

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్‌ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్‌ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.