News September 23, 2024

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: మాజీ గవర్నర్

image

నాగర్ కర్నూల్ పట్టణంలోని హిమాలయ హోటల్లో సోమవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ శతజయంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

MBNR: సౌత్ జోన్.. PU కబడ్డీ జట్టు READY

image

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్సిటీ స్త్రీల కబడ్డీ జట్టు చెన్నైలోని వినాయక మిషన్ ఫౌండేషన్ వర్సిటీకి బయలుదేరింది. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.జిఎన్ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్, మేనేజర్ ఉష పాల్గొన్నారు.

News October 27, 2025

MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నలుగురి అరెస్ట్

image

మహబూబ్‌నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. జడ్చర్ల టౌన్ CI కమలాకర్ వివరాల ప్రకారం.. గంజాయి విక్రయంపై దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశామని, వారి నుంచి మొత్తం 241 గ్రాముల గంజాయి, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచామన్నారు.

News October 27, 2025

MBNR: రిపబ్లిక్ డే.. కంటింజెంట్ అధికారిగా అర్జున్ కుమార్

image

గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించే పరేడ్ వేడుకకు కంటింజెంట్ ఆఫీసర్‌గా పీయూ అధ్యాపకుడు డాక్టర్ ఎస్ఎన్.అర్జున్ కుమార్ ఎంపిక కావడం గర్వకారణమని వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పరిపాలన భవనంలో VCతోపాటు రిజిస్ట్రార్ రమేష్ బాబు,ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె ప్రవీణ అభినందించారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఈనెల 31 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ-రిపబ్లిక్ డే శిబిరానికి వెళ్లనున్నారు.