News March 11, 2025

ఉప్పలగుప్తం: పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

image

ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ప్రధాన పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 52 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష మృతదేహం గత మూడు రోజుల నుంచి కాలువలో కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు, పోలీసు ఇంతవరకు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని, దుర్వాసన వస్తుందని పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News September 17, 2025

GNT: మణికంఠ హత్యకేసులో ముద్దాయిల అరెస్ట్

image

గుంటూరు సంగడిగుంటలో మణికంఠ(27)పై దాడిచేసి అతని మరణానికి కారణమైన 11 మంది నిందితులను లాలాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చుట్టుగుంటకు చెందిన యర్రం యశ్వంత్‌కి, మణికంఠతో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో యశ్వంత్ ఈ నెల 8న మణికంఠతో గొడవపెట్టుకొని అతని స్నేహితులతో కలిసి దాడి చేయగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదుమేరకు నిందితులను అరెస్ట్ చేశారు.

News September 17, 2025

వరిధాన్యం రవాణాకు సహకరించండి: DTO

image

ఖరీఫ్ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు సహకరించాలని లారీ, ట్రాక్టర్ యజమానులకు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సమీప రైతు సహాయక కేంద్రాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సహకరించిన వాహన యజమానులకు రవాణా ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

News September 17, 2025

తెలంగాణ విమోచనంలో ఉమ్మడి KNR జిల్లా యోధులు

image

TG సాయుధ పోరాటంలో ఉమ్మడిKNR జిల్లా వీరులది కీలకపాత్ర. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి వీరులగడ్డ కేంద్రంగా నిలిచింది. అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి అంజిరెడ్డి, బోయినపల్లి వెంకటరావు, దేశిని చిన్నమల్లయ్య లాంటి ఎందరో యోధులు నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. TG సాయుధ పోరాటం వంటి ఉద్యమాల్లో పాల్గొని నిజాంకు సవాలు విసిరారు.