News March 11, 2025
ఉప్పలగుప్తం: పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ప్రధాన పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 52 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష మృతదేహం గత మూడు రోజుల నుంచి కాలువలో కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు, పోలీసు ఇంతవరకు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని, దుర్వాసన వస్తుందని పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 24, 2025
నిర్మల్: డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే టైలరింగ్, డ్రాయింగ్ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 5 అని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) భోజన్న తెలిపారు. ఈ పరీక్షలు జనవరి, ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కు రూ.100, హయ్యర్ గ్రేడ్కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీకి రూ.100, హయ్యర్ గ్రేడ్కు రూ.200 చొప్పున చెల్లించాలన్నారు.
News November 24, 2025
నల్గొండ: మహిళా ఓట్ల కోసం వ్యూహం..!

అధికార కాంగ్రెస్ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ఫోకస్ చేసింది. చాలా వేగంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. NLG జిల్లాలో 29,754 గ్రూపుల్లో, 2,97,054 సభ్యులు, SRPT జిల్లాలో 17,611 గ్రూపుల్లో 1,91,576 సభ్యులు, BNG జిల్లాలో 39,871 గ్రూపులకు 1,59,482 సభ్యులకు చీరలు పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగా రేషన్ కార్డున్న వారికి సైతం అందించి ఓట్లను సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు.
News November 24, 2025
జగిత్యాల: గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు పరిశీలించిన ఎస్పీ

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 6 మంది అర్జీదారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువ కావడం లక్ష్యంగా ప్రతి ఫిర్యాదుపై మర్యాదపూర్వకంగా స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలనతో వేగంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు.


