News January 27, 2025

ఉప్పలగుప్తం: స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు పురస్కారం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ హోదాలలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో పాములను సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ సమాజ సేవ చేస్తున్న ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ కలెక్టర్ మహేశ్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మను పలువురు అభినందించారు.

Similar News

News October 19, 2025

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొన్ని చోట్ల స్వల్పంగా పెరగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. APలోని చిత్తూరు, కృష్ణా, పల్నాడులో KG ధర రూ.220-240, గుంటూరులో రూ.200-220గా ఉంది. అటు TGలోని HYDలో కిలో రూ.220-240, వరంగల్, హన్మకొండలో రూ.210-230కు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? COMMENT

News October 19, 2025

విశాఖ మ్యూజియం ఎప్పుడైనా సందర్శించారా?

image

విశాఖ మ్యూజియం నగర వాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. దీనిని అప్పటి CM జనార్దన్ రెడ్డి 1991లో ప్రారంభించారు. డచ్ భవనంలో ఉన్న మారిటైమ్ మ్యూజియంలోని 10 గదుల్లో నేవీ ఉపయోగించిన ఆయుధాలు, నేవీ చేసిన యుద్దాల సమచారాన్ని కళాఖండాల రూపంలో ప్రదర్శించారు. అదేవిధంగా విశాఖ మ్యూజియం వెనుక ఉన్న రెండంతస్థుల భవనాన్ని హెరిటేజ్ మ్యూజియంగా మార్చారు. ఇందులో పురావస్తు విభాగానికి చెందిన 5 గ్యాలరీలు కలవు.

News October 19, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

image

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.