News January 27, 2025
ఉప్పలగుప్తం: స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు పురస్కారం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ హోదాలలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో పాములను సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ సమాజ సేవ చేస్తున్న ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ కలెక్టర్ మహేశ్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మను పలువురు అభినందించారు.
Similar News
News December 4, 2025
సివిల్ సర్వీసులో విజయం సాధించాలి: భట్టి విక్రమార్క

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ప్రజా భవన్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ డిప్యూటీ సీఎం, సింగరేణి సీఎండీ బలరాం శుభాకాంక్షలు తెలిపారు.
News December 4, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతుల కల్పన: కలెక్టర్

దేవదాయ శాఖ పరిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వసతి సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ఈఓలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో వన్ లాక్ స్కీం అమలు కోసం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.
News December 4, 2025
తిరుపతి: విద్యార్థులు.. విజ్ఞాన.. విహార యాత్రలు

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన.. విహార యాత్రల నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 44 పాఠశాల్లోని 8, 9 తరగతి విద్యార్థులు 6809 మందిని తీసుకెళ్తున్నారు. ఈనెల 10వ తేదీ లోపు శ్రీహరికోట, జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, చంద్రగిరి కోట ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.500 కేటాయించింది.


