News April 5, 2024
ఉప్పల్లో నేడు IPL మ్యాచ్.. స్పెషల్ బస్సులు

HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్కేసర్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో టైమింగ్స్ కూడా పొడిగిస్తారు. SHARE IT
Similar News
News November 27, 2025
పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ

గ్రేటర్లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేసినపుడు కూడా అదే పరిస్థితి.
News November 27, 2025
HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్నగర్లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.


