News December 11, 2024

ఉప్పల్‌లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్

image

HYDలోని ఉప్పల్‌లో సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మిథాలీ రాజ్ సందర్శించారు. ఆమె ఈ పర్యటన తమకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు, అసిస్టెంట్లు తెలిపారు. ప్రతి రంగంలో రాణించేందుకు చేయాల్సిన కృషి, పట్టుదల ఆమె మాటలు తెలిపాయన్నారు.

Similar News

News November 16, 2025

చూద్దాం పదండి.. హైదరాబాద్ అందాలు

image

భాగ్యనగరం అంటే చార్మినార్‌, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్‌ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి.<<18301143>> ఫలక్‌నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.

News November 16, 2025

HYD: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష .

image

డిసెంబర్ 8- 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఫ్యూచర్ సిటీ, ముచ్చర్లలో భారీ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ విడుదల చేయనున్నారు. 2035నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంమని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంపై దృష్టి పెట్టామని, 70 థీమాటిక్ స్టాల్స్ తెలంగాణ అభివృద్ధి ప్రతిరూపమన్నారు.

News November 16, 2025

HYD: స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం.. సమస్యలు ఇవే!

image

స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన భుజం, మెడ, వెన్నునొప్పి కేసులు పెరుగుతున్నాయని NIMS వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు బయట పడుతున్నాయని హెచ్చరించారు. గంటల తరబడి ఫోన్‌లో తల వంచడం వలన నాడులు, కండరాలపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక నొప్పులు వస్తున్నాయని, ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకోవడం మంచిదని సూచించారు.
SHARE IT