News March 30, 2025
ఉప్పల్లో యాక్సిడెంట్.. లేడీ ఆఫీసర్ మృతి

ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎక్సైజ్ ఉద్యోగి స్వరూప రాణి(58) అక్కడికక్కడే మృతి చెందింది. బోడుప్పల్ జ్యోతినగర్కి చెందిన స్వరూపా రాణి(58) శంషాబాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడ్మిన్గా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా శంషాబాద్కు వెళ్లిన స్వరూపా రాణి విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
Similar News
News April 6, 2025
ఈ నెల 30 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం

చార్ ధామ్ యాత్ర ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా వచ్చే నెల 2న కేదార్నాథ్, 4న బద్రీనాథ్ గుళ్లను తెరుస్తారు. భక్తుల రక్షణార్థం 6వేలకు పైగా పోలీసుల్ని, భద్రతాసిబ్బందిని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. 10 కి.మీకి ఒక సెక్టార్ చొప్పున 137 సెక్టార్లుగా యాత్ర మార్గాన్ని విభజించామని నిరంతరం భద్రతాసిబ్బంది గస్తీ తిరుగుతుంటారని వారు స్పష్టం చేశారు.
News April 6, 2025
గుజరాత్తో సన్రైజర్స్ ఢీ.. గెలుపెవరిదో!

IPLలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్తో సన్రైజర్స్ తలపడనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న SRH సొంత గ్రౌండ్లో మళ్లీ గాడిన పడాలని చూస్తోండగా వరుస విజయాల జోరును కొనసాగించాలని GT భావిస్తోంది. SRH టీమ్ బ్యాటింగ్లో క్లిక్ అవ్వకపోగా బౌలింగ్లో వికెట్లూ తీయలేకపోతోంది. ఫీల్డింగ్లోనూ పేలవంగానే కనిపిస్తోంది. మరోవైపు GT బలంగా ఉంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
News April 6, 2025
ట్రోలింగ్ వల్ల వారికి ఏం ఆనందం వస్తుందో: మోహన్ బాబు

ట్రోలింగ్ను తాను పట్టించుకోనని నటుడు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎదుటివాళ్లు నాశనమవ్వాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్లకంటే ముందు మనమే నాశనమవుతాం. అందరూ క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఈ ట్రోలింగ్ చేసేవారికి దాని వల్ల ఏం ఆనందం వస్తుందో అర్థంకాదు. అయితే ఎవర్నీ నిందించను. దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ పిల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్నాను అంతే’ అని తెలిపారు.