News December 26, 2024
ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్యాలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో కూచిపూడి నాట్య గురువు సాత్విక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మహాగణపతిమ్, లింగాష్టకం, బాలకనకయ్య, చిన్ని శిశివు, అన్నపూర్ణ, అల్లోనేరేళ్లో, పేరిణి కౌత్వం, వారాహి, అష్టలక్ష్మి, గరుడ గమన మొదలైన అంశాలను.. స్ఫూర్తి, నిత్యశ్రీ, గగనశ్రీ, సాన్విక, యోషిక, జూషిత, సహస్ర, ప్రణవి, మనస్వి తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
Similar News
News January 18, 2025
RR: రైతు భరోసా సర్వే.. టార్గెట్-20
RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 20 తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను సైతం కలిసి వివరాలు సేకరిస్తున్నారు.
News January 18, 2025
త్వరలో చేవెళ్లకు ఉప ఎన్నిక: KTR
త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
HYD: ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఢిల్లీ పీఠం మాదే: డీకే అరుణ
ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఢిల్లీ పీఠం మాదే అని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం HYDలో బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయిందని, ఢిల్లీలో పరిపాలన గాడి తప్పింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం అన్నారు.