News February 14, 2025

ఉప్పునుంతల: 21తేది నుంచి వెల్టుర్‌లో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

image

ఉప్పునుంతల మండలంలోని వెల్టుర్ గ్రామంలో ఈనెల 21తేది నుంచి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్సయ్య, దుర్గయ్య, బాల్ చంద్రి, నిరంజన్, లక్ష్మయ్య తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 25తేదీన అమ్మవారి కళ్యాణం, 26 తేదీన బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. 

Similar News

News December 10, 2025

‘బాపట్లలో ప్రాంతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి’

image

బాపట్లలో ప్రాంతీయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రం అందించారు. శిక్షణా సంస్థ ద్వారా ఆయుష్ విధానాలపై శిక్షణ, ఆయుష్ వైద్య విద్యను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో యోగ, ఆయుష్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.

News December 10, 2025

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో MP బాలయోగి

image

పార్లమెంట్‌లోని సీబ్లాక్‌లో జరిగిన కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమలాపురం MP గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈసమావేశంలో వలస కార్మికుల నైపుణ్య, భాషా శిక్షణ, PMKVY 4.0 పురోగతి వంటి అంశాలపై సమీక్ష జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ ‘డ్రాఫ్ట్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ను కమిటీ ఆమోదించింది.

News December 10, 2025

SKLM: ‘మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలం’

image

మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలమని జిల్లాకోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం మెప్మా కార్యాలయంలో బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవ గౌరవాలకు ఈ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని తెలుసుకొని సమాజంలో గౌరవంగా నడుచుకోవాలన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరావు ఉన్నారు.