News February 14, 2025

ఉప్పునుంతల: 21తేది నుంచి వెల్టుర్‌లో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

image

ఉప్పునుంతల మండలంలోని వెల్టుర్ గ్రామంలో ఈనెల 21తేది నుంచి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్సయ్య, దుర్గయ్య, బాల్ చంద్రి, నిరంజన్, లక్ష్మయ్య తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 25తేదీన అమ్మవారి కళ్యాణం, 26 తేదీన బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. 

Similar News

News November 14, 2025

NTR: దైవ దర్శనానికి వెళుతూ.. దంపతులు మృతి

image

గుడ్లూరు (M) మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. NTR(D) జి.కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్‌కి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతిచెందారు. వీరు తిరమలకు వెళుతుండగా ఘటన జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.

News November 14, 2025

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

image

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

News November 14, 2025

సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి: ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని పోలీసులను ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, లాకప్ గదులు, ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్, కేసుల ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.