News February 11, 2025

ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ

image

ఉమ్మడి గోదావరి జిల్లాలలో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూగా అధికారులు నిర్ధారించారు. తణుకు మండలం వేల్పూరు, తూ.గోలోని పెరవలి(M) కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన శాంపిల్స్‌ తో బర్డ్ ఫ్లూగా తేల్చారు. కానూరు గ్రామానికి 10కి.మీల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చికెన్, గుడ్లు తినడం తగ్గించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. కి.మీ పరిధిలోని కోళ్లను, గుడ్లను కాల్చి వేయాలని ఆదేశించారు.

Similar News

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహలు కలకలం

image

కృష్ణానది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం ఇద్దరి మృతదేహలు కలకలం సృష్టించాయి. సుమరు 40 సంవత్సరాల వ్యక్తి, 12 సంవత్సరాల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. బ్యారేజ్ ర్యాంప్ సమీపంలో మృతదేహాలను గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

News November 25, 2025

FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

image

ట్రాన్స్‌జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్‌లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్‌జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.