News December 5, 2024

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఎన్నికలు ప్రారంభం

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు వేయనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Similar News

News October 28, 2025

తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

image

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News October 28, 2025

తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

image

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

రాజమండ్రి: BSNL వినియోగదారులకు గమనిక

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో BSNL నెట్వర్క్ సక్రమంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అవసరమైన చోట్ల మొబైల్ జనరేటర్లు, ఏడు డివిజన్లలో ఏడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ సమయంలో నెట్వర్క్ ఇబ్బందులు తలెత్తితే వినియోగదారులు 0883-2472200కు కాల్ చేయాలని కోరారు.