News December 5, 2024
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఎన్నికలు ప్రారంభం

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు వేయనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Similar News
News January 23, 2026
తూ.గో. జిల్లాలో కలిసిన 4 పోలీస్ స్టేషన్లు

జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని మండపేట టౌన్, రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లు రాజమహేంద్రవరం తూర్పు మండలం పరిధిలోకి వచ్చాయి. అలాగే, తూర్పు మండలంలోని బొమ్మూరు స్టేషన్ను దక్షిణ మండలానికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
News January 23, 2026
రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News January 23, 2026
రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


