News April 15, 2025
ఉమ్మడిజిల్లాలో నేటి టాప్ న్యూస్

నిర్మల్: జిల్లాలో 3 యాక్సిడెంట్లు.. ఇద్దరి మృతి, ముగ్గురు సీరియస్
మంచిర్యాల: ఉరేసుకొని యువకుడి సూసైడ్
మంచిర్యాలలో: బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తీసిన వైద్యులు
సిర్పూర్(టి): ఐదేళ్ల బాలికపై కుక్కల దాడి
ADB: 500 దేశీదారు బాటిళ్లు సీజ్.. ఒకరి అరెస్ట్
పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి
Similar News
News December 2, 2025
నల్గొండ: సెటిల్మెంట్ల కోసం నామినేషన్లు..?

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలో కొందరు ప్రజా సేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీదారులతో మాట్లాడుకుంటున్నారు. కొంత డబ్బు తీసుకుని విత్డ్రా చేసుకుని, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను సైతం చివరకు దందా చేశారని పలువురు మండిపడుతున్నారు.
News December 2, 2025
భద్రాద్రి: రెండో రోజు అందిన నామినేషన్ వివరాలు

గ్రామపంచాయతీ ఎన్నికల 2వ విడతలో 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 2వ రోజు సోమవారం మండలాల వారీగా అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ వివరాలు.. అన్నపురెడ్డిపల్లి – 8, 6, అశ్వారావుపేట – 15, 13, చండ్రుగొండ – 9, 8, చుంచుపల్లి – 14, 13, దమ్మపేట – 19, 19, ములకలపల్లి -13, 13, పాల్వంచ -22, 18, మొత్తం సర్పంచ్ 100, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
News December 2, 2025
కృష్ణా: టెన్త్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరయల్స్

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 60 వేలమందికి పైగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి వందరోజుల ప్రణాళిక అమలు చేయనున్నారు. అదే రోజు తుది పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా స్ఫూర్తి మెటీరియల్తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా SCERT మరో మెటీరియల్ అందిస్తుంది. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి. పిల్లలు అందరూ ఒక విధంగా పరీక్షలకు సిద్ధం కావాలని మెటీరియల్ ఆదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


