News April 15, 2025
ఉమ్మడిజిల్లాలో నేటి టాప్ న్యూస్

నిర్మల్: జిల్లాలో 3 యాక్సిడెంట్లు.. ఇద్దరి మృతి, ముగ్గురు సీరియస్
మంచిర్యాల: ఉరేసుకొని యువకుడి సూసైడ్
మంచిర్యాలలో: బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తీసిన వైద్యులు
సిర్పూర్(టి): ఐదేళ్ల బాలికపై కుక్కల దాడి
ADB: 500 దేశీదారు బాటిళ్లు సీజ్.. ఒకరి అరెస్ట్
పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి
Similar News
News April 16, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, గం.కు40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. VKB జిల్లాల్లో మోస్తరు వర్షాలు, గం.కు40-61KM వేగంతో గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అటు 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 16, 2025
AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News April 16, 2025
RGM: ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి: CP

నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని CPప్రారంభించారు. ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. CPR చేసే విధానం గురించి సీపీ సిబ్బందికి వివరించారు.