News April 5, 2024
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మండిన ఎండలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం భానుడు మండుతున్నాడు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో 43.83 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నెలకొంది. సింగనమలలో 43.59, ఎల్లనూరులో 43.40 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొనగా, శ్రీ సత్యసాయి జిల్లాలో అధికంగా పుట్టపర్తి మండలంలో 42.58 డిగ్రీలు, పరిగి మండలంలో 42.50, చెన్నేకొత్తపల్లిలో 42.50, కొత్తచెరువులో 42.40, ముదిగుబ్బ మండలంలో 42.20 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నెలకొంది.
Similar News
News January 13, 2025
అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి
కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.
News January 13, 2025
శ్రీ సత్యసాయి: 1,668 మందికి ఉద్యోగాలు
ధర్మవరంలో గురువారం జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. 5,120 మంది జాబ్ మేళాకు హాజరు కాగా, 99 కంపెనీల ప్రతినిధులు 1,668 మందిని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.
News January 13, 2025
అనంతపురం జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు
అనంతపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్లు చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.