News March 28, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో ఐదుగురికి నామినేటెడ్ పదవులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదుగురికి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్గా అశ్వర్థ నారాయణరెడ్డి, కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్గా లక్ష్మీదేవి, మడకశిర మార్కెట్ యార్డు ఛైర్మన్గా గురుమూర్తి, గుంతకల్లు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్గా లక్ష్మీదేవికి అవకాశం లభించింది. ధర్మవరం మార్కెట్ యార్డు ఛైర్మన్గా నాగరత్నమ్మ (బీజేపీ)ను నియమించారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం మార్కెట్కు రేపు, ఎల్లుండి సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
News December 5, 2025
తిరుపతి: ఆయిల్ ఫామ్తో ప్రయోజనాలివే.!

ఆయిల్ ఫాం ప్రపంచంలోనే అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే పంటని తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. ప్రతి ఎకరాకు సుమారు 4 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఫామ్ ఆయిల్ అందిస్తుందని, ఇది ఇతర నూనె గుంజల పంటలతో పోలిస్తే 4నుంచి 10రెట్లు అధికంగా ఉంటుందని అన్నారు. ఒకసారి నాటిన తర్వాత ఆయిల్ ఫామ్ పంట 25 సంవత్సరాల వరకు రైతులకు నిరంతరం ఆదాయం ఇస్తుందన్నారు.
News December 5, 2025
చిత్తూరు: ‘తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి’

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.


