News March 28, 2025

ఉమ్మడి అనంత జిల్లాలో ఐదుగురికి నామినేటెడ్ పదవులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదుగురికి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్‌గా అశ్వర్థ నారాయణరెడ్డి, కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి, మడకశిర మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా గురుమూర్తి, గుంతకల్లు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవికి అవకాశం లభించింది. ధర్మవరం మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా నాగరత్నమ్మ (బీజేపీ)ను నియమించారు.

Similar News

News November 23, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ముందుగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

News November 23, 2025

HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.

News November 23, 2025

APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://jipmer.edu.in/