News February 16, 2025
ఉమ్మడి కరీంగర్ జిల్లాలోని నేటి CRIME NEWS

@KNR-JGL ప్రధాన రహదారి పై వరుస ప్రమాదాలు.. భయందోళనలో ప్రజలు @KNR భూ కబ్జా ఘటన.. ఇరిగేషన్ అధికారుల పాత్ర పై పోలీస్ అధికారుల విచారణ @మెట్పల్లిలో ముగ్గురు దొంగల అరెస్ట్ @కథలాపూర్లో బంగారం దొంగలించిన ఇద్దరి యువతుల అరెస్ట్ @పెగడపల్లిలో పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య @దమన్నపేటలో తాళం వేసిన ఉన్న ఇంట్లో బంగారం చోరీ @రాజన్న సిరిసిల్లలో ప్రాణం తీసిన సెల్ఫీ వీడియో
Similar News
News December 1, 2025
ADB: ‘డబ్బు పంపండి.. లేదంటే న్యూడ్ ఫొటోలు పంపుతాం’

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోథ్కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడికి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే తన అకౌంట్కు డబ్బులు పంపాలని లేదంటే బాధితుడి న్యూడ్ ఫొటోలు ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు పంపుతాం అని హిందీలో బెదిరించారు. ఫోన్ నంబర్ పాకిస్థాన్కు చెందినదిగా గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 1, 2025
పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.
News December 1, 2025
42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.


