News March 20, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్

image

కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో గురు, శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నాడు.

Similar News

News October 31, 2025

KNR: ‘విజిలెన్స్ మనందరి సంయుక్త బాధ్యత’

image

ఆర్టీసీలో OCT 28 నుంచి NOV 2 వరకు నిర్వహించుచున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా KNR బస్టాండ్ ఆవరణలో KNR RM బి.రాజు, జోనల్ విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారి ఎం.రవీందర్, డిప్యూటీ RMలు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం సిబ్బందితో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. RM మాట్లాడుతూ.. విజిలెన్స్ మనందరి సంయుక్త బాధ్యత అన్నారు. ప్రతి ఉద్యోగి విధుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగిన సంస్కృతిని పెంపొందిస్తామన్నారు.

News October 31, 2025

తక్షణమే సాయం చేయండి.. కేంద్రానికి ఏపీ నివేదిక

image

AP: మొంథా తుఫాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. 1.38L హెక్టార్లలో పంట నష్టం, 2.96L మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని తెలిపింది. ‘249 మండలాల పరిధిలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం పడింది. రైతులకు ₹829Cr నష్టం వచ్చింది. రోడ్లు, విద్యుత్ సహా 17 రంగాల్లో ₹5,244Cr నష్టం వాటిల్లింది. పరిశీలనకు కేంద్ర బృందాలను పంపి తక్షణమే సాయం అందించాలి’ అని కోరింది.

News October 31, 2025

మీ డబ్బు – మీ హక్కు’ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

image

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రారంభించిన ‘మీ డబ్బు – మీ హక్కు’ (Your Money – Your Right) ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. పౌరులు తమ పేరు మీద ఉండి, క్లెయిమ్ చేయని లేదా మరిచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.