News August 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ ధర్మపురి ఉపాధ్యాయురాలికి రాష్ట్రపతి అవార్డు. @ బలగం వేణుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీమంత్రి కేటీఆర్ అభినందన. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. @ రామడుగు మండలంలో పర్యటించిన దర్శకుడు బోయపాటి శ్రీను. @ జగిత్యాలలో కొనసాగుతున్న జర్నలిస్టుల నిరవధిక నిరసన.

Similar News

News October 8, 2024

జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు

image

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.

News October 8, 2024

సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.

News October 8, 2024

పెద్దపల్లి: రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన ఎంపీ

image

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, రెచ్నిలలో కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి కోసం నేడు పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రైల్వే ప్రయాణం అందించడం కొరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.