News September 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గన్నేరువరం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ ఇల్లంతకుంట మండలంలో విద్యార్థికి పాముకాటు.
@ జగిత్యాల రూరల్ మండలంలో గేదెను ఢీకొని ద్విచక్ర వాహన దారుడు మృతి.
@ 30 ఏళ్ల పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
Similar News
News September 21, 2024
కొత్తపల్లి: రైల్వే లైన్ పనులకు రూ.137 కోట్లు
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల కోసం ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసింది. అలాగే కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్యలో ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామం. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ.. ఈ వేగంతో పనులు ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు.
News September 21, 2024
జగిత్యాల: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి
జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.
News September 21, 2024
కరీంనగర్: బాలికపై లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
KNR జిల్లా వీణవంక మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. SI తిరుపతి ప్రకారం.. మండలంలోని ఐదో తరగతి చదువుతున్న ఓ పదకొండేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈనెల 16న కేసు నమోదు చేయగా.. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేశాడు.