News November 10, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ శంకర్ పట్నం మండలంలో లారీ, బైకు డీ.. ఒకరి మృతి. @ చెందుర్తి మండలంలో బస్సు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ ధర్మపురిలో వైభవంగా గోదావరి మహా హారతి. @ మాజీ ఎమ్మెల్యే జ్యోతి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. @ సిరిసిల్లలో ఉరి వేసుకుని నేత దంపతుల ఆత్మహత్య. @ జగిత్యాల మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
Similar News
News December 20, 2025
కరీంనగర్: పోగొట్టుకున్న 60 మొబైల్ ఫోన్ల రికవరీ

పోగొట్టుకున్న ఫోన్లను కరీంనగర్ టౌన్ పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. CEIR పోర్టల్ ద్వారా రూ.10 లక్షల విలువైన 60 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఏసీపీ తెలిపారు. శనివారం వీటిని బాధితులకు అందజేశారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. పోలీసుల పనితీరుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
News December 20, 2025
కరీంనగర్: ‘సమిష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతం’

పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమిష్టిగా బాధ్యతాయుతంగా నిర్వహించిన అధికారుల తీరు అభినందనీయమని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం ZP CEO శ్రీనివాస్ ఆధ్వర్యంలో MPDOలు అదనపు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలబోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ పకడ్బందీగా వ్యవహరించడం వల్లే ప్రక్రియ సమర్థవంతంగా పూర్తయిందని కొనియాడారు.
News December 20, 2025
KNR: ఈనెల 23న దివ్యాంగుల ఉపకరణాల శిబిరం

ఈ నెల 23న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో దివ్యాంగుల వయో వృద్ధుల సహాయ ఉపకరణాల శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి సంగీత తెలిపారు. ఆసక్తి గల దివ్యాంగులు ఈ శిబిరంలో బ్యాటరీ ట్రై సైకిల్, వీల్ ఛైర్లు, వినికిడి యంత్రాలు మొదలైన వాటికి నమోదు చేసుకోవాలన్నారు. అర్హత గలవారు సదరం, ఆదాయ ధృవీకరణ, రేషన్, ఆధార్ కార్డు, 2 ఫోటోలతో హాజరవ్వాలని సంక్షేమ అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.


