News December 31, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జగిత్యాల ప్రజావాణిలో 32, సిరిసిల్ల ప్రజావాణిలో 141 ఫిర్యాదులు.
@ రాయికల్ మండలంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో ఆత్మహత్యకు పాల్పడిన ఐటిఐ విద్యార్థి.
@ రామడుగు మండలంలో తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు.
@ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న పోలీసులు
Similar News
News January 18, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,34,601 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,994 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.46,250, అన్నదానం రూ.9357 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 18, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోహెడ మండలంలో రేపు పర్యటించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ వీణవంక మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ఎండపల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. @ మెట్పల్లి పట్టణంలో ప్రయాణికుల దినోత్సవం. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత. @ లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చర్యలు తీసుకుంటామన్న కరీంనగర్ కలెక్టర్.
News January 17, 2025
కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్: బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదన్నారు.