News May 26, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ మెట్పల్లి మండలం జగ్గసాగర్లో వైభవంగా కొండ స్వామి రథోత్సవం. @ జగిత్యాల జిల్లాలో 25 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల ఎస్పి. @ మేడిపల్లి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
Similar News
News December 2, 2025
KNR: బహిరంగ మద్యపానంపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగం, భారీ డీజే సౌండ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. భద్రతాపరమైన అంశాలు, శబ్ద కాలుష్యం, మహిళల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 2, 2025
KNR: ఎన్నికల బందోబస్తుపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News December 2, 2025
సైబర్ నేరాలకు ‘ఫుల్స్టాప్’.. అవగాహనతోనే పరిష్కారం

మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైమ్ ఠాణాలో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ – సైబర్ క్లబ్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ముందుకు వచ్చి సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని సీపీ పిలుపునిచ్చారు.


