News June 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామోజీరావుకు ఘన నివాళులు.
@ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్న జగిత్యాల కలెక్టర్.
@ సైదాపూర్ మండలంలో అనుమానాస్పద స్థితిలో దినసరి కూలీ మృతి.
@ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
@ తంగళ్ళపల్లి మండలంలో షెడ్డు కూలీ రెండు లేగ దూడలు మృతి.
@ కాటారం మాజీ జెడ్పిటిసి మృతి.
@ పెద్దపల్లిలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

Similar News

News October 3, 2024

కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.

News October 3, 2024

KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

News October 3, 2024

ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.