News June 26, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ పెగడపల్లి మండలంలో బైక్, టాటా ఏస్ డీ.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో 4 ఇసుక ట్రాక్టర్లు సీజ్. @ రాయికల్ మండలంలో తనిఖీలు నిర్వహించిన జగిత్యాల కలెక్టర్. @ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా రఘువరన్. @ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న కరీంనగర్ కలెక్టర్. @ ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Similar News
News February 17, 2025
కరీంనగర్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జనం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News February 17, 2025
కరీంనగర్తో కేసీఆర్కు విడదీయరాని బంధం

కరీంనగర్ అంటేనే.. కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటాయి. KCRకు KNR జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు 2001లో KNR గడ్డపైనే ప్రకటించారు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2018, మే 10న రైతుబంధును ఇక్కడే ప్రారంభించారు. త్వరలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను కరీంనగర్లోనే ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్.
News February 17, 2025
కరీంనగర్: ఇంటర్ విద్యార్థులకు మరొక అవకాశం

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం మరొక అవకాశం కల్పించింది. ఈనెల 3 నుంచి 16వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 22వరకు KNRలోని ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డీఐఈవోను సంప్రదించి అనుమతి తీసుకోవాలి.