News November 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా దీక్ష దివాస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే

image

ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్ష దివాస్ నిర్వహించనున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్ష దివాస్ నిర్వహణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. కరీంనగర్ జిల్లాకు MLC బండ ప్రకాశ్, సిరిసిల్ల జిల్లాకు మాజీ MP వినోద్ కుమార్, పెద్దపల్లి జిల్లాకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లాకు మాజీ MLC MD. సలీంను నియమించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 16, 2025

కరీంనగర్: ‘గృహ నిర్మాణంలో పారదర్శకత పాటించాలి’

image

72వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో గృహ నిర్మాణ సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రామానుజాచార్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సహకార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా సంఘాలు సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

News November 16, 2025

కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

image

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్‌ప్లేట్‌ లేని వాహనాలు, హెల్మెట్/సీట్‌బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్‌ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్‌కు ఆయన స్పష్టం చేశారు.

News November 15, 2025

భరోసా కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.