News November 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. పగటిపూట సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువ అవుతాయని నిపుణులు సూచించారు. చలి తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News March 6, 2026

మిషన్ మోడ్‌లో ‘ప్రజా పాలన’: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను మిషన్ మోడ్‌లో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రత్యేక అంశాలతో (థీమ్స్) ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

News March 6, 2026

UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

<<19312594>>బైక్‌ను టిప్పర్<<>> ఢీకొన్న ఘటనలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ మృతి చెందారు. శుక్రవారం ఈ ఇద్దరు మిత్రులు బైక్‌పై వెళుతుండగా చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల తలలు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 6, 2026

రామడుగు: రెండు రోజుల్లో పెండ్లి.. ఇంతలోనే దారుణం..!

image

పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. రామడుగుకు చెందిన ఈరెల్లి గౌరమ్మ (65) తన పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్లలో ఉండగా, హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకం వెనుక తెలిసిన వారే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.